యాప్నగరం

హైదరాబాద్ పేరు మారుస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్

16వ శతాబ్దంలో హైదరాబాద్ పేరు ‘భాగ్యనగరం’ అని ఉండేదని, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ తప్పకుండా పేరు మార్చుతామని బీజేపీ నేత రాజ సింగ్ తెలిపారు.

Samayam Telugu 9 Nov 2018, 8:32 pm
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అలహాబాద్ తరహాలోనే హైదరాబాద్ పేరు కూడా మారుస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి పేర్లను మార్చడం తమ రెండో లక్ష్యమని వెల్లడించారు.
Samayam Telugu photo


ఒకప్పుడు భాగ్యనగరంగా పేరొందిన నగరానికి 16వ శతాబ్దంలోని కుతుబ్ షాహీ హైదరాబాద్‌గా పేరు మార్చారని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది హిందువులపై దాడులు చేశారని, ఆలయాలను ధ్వంసం చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి భాగ్యనగరంగా మార్చుతామని తెలిపారు.

హైదరాబాద్ పేరు మాత్రమే కాకుండా అప్పట్లో నగరం, తెలంగాణలోని ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చారని రాజ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల పేర్లను కూడా మార్చారన్నారు. అలాంటి ప్రాంతాలకు దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన ప్రముఖుల పేర్లు పెడతామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.