యాప్నగరం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తా: కోమటిరెడ్డి

కేంద్రం నుంచి వచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు అందకుండా దారి మళ్లించిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Samayam Telugu 16 Dec 2018, 4:31 pm
తన జీవితం ప్రజాసేవకే అంకితమని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు పదవి ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం (డిసెంబర్ 16న) మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉన్నానని, ఇప్పుడూ అదే కొనసాగిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu Komatireddy Venkat Reddy


పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడగా ఆయన అంగీకరించినట్లు వెల్లడించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నేతల సహాయంతో బరిలోకి దిగడం ఖాయమన్నారు. అయితే అసెంబ్లీ ఫలితాల ఓటమి నుంచి తేరుకుని సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకుని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలను సర్పంచ్‌లుగా గెలిపించాలని కోరారు.

గ్రామ స్థాయిలో అన్ని గ్రామాలకు నిధులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సి న అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్లలో సర్పంచ్‌లకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు అందకుండా దారి మళ్లించిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
Read: చేతులు జోడించి కేసీఆర్‌ను వేడుకున్న కోమటిరెడ్డి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.