యాప్నగరం

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి

కాంగ్రెస్ హేమా హేమీలకు తప్పని ఓటమి.. నాాగార్జున సాగర్‌లో ఓటమిపాలైన సీనియర్ నేత జానారెడ్డి..

Samayam Telugu 11 Dec 2018, 2:30 pm
Samayam Telugu jana.
తెలంగాణ ఎన్నికల్లో కారు జోరు కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. హస్తం పార్టీ హేమాహేమీలు పోటీ చేస్తున్నచోట జెట్ స్పీడుతో దూసుకుపోయింది. నల్గొండ జిల్లాలో కీలకమైన నాగార్జునసాగర్‌లో గులాబీ జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జున సాగర్ అభ్యర్థి జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆధిక్యం పెంచుకుంటూ చివరికి జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 9,368 మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభంలో కొన్ని రౌండ్లు జానారెడ్డి ముందంజలో కనిపించినా.. తర్వాత నోముల నర్సింహయ్య మెజార్టీ వైపు వెళ్లారు.

సీఎల్పీ లీడర్‌గా పనిచేసిన జానారెడ్డి ఓటమి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్‌గానే చెప్పాలి. అంతేకాదు ఒకానొక సందర్భంగా కూటమి గెలిస్తే జానానే సీఎం అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. జానారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ భావించినప్పటికీ.. ఆయనకు ఓటమి తప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.