యాప్నగరం

'ముందస్తు'తో పోటీకి దూరం.. పార్లమెంట్‌ బరిలో నిలుస్తాం: పవన్

ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించాం.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటమే జనసేన లక్ష్యం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం.

Samayam Telugu 19 Nov 2018, 5:31 pm
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై సందిగ్థత తొలగిపోయింది. నామినేషన్ల గడువు ముగిసిపోవడంతో.. పోటీకి దూరంగా ఉన్నట్లేనని తేలిపోయింది. అయితే ఈ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో కారణాలను వివరిస్తూ.. పార్టీ అధినేత పవన్ పేరుతో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ‘తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితి ఎన్నికలు జరిగినట్లయితే.. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై ఓ ప్రణాళికను రూపొందించుకున్నాము. కాని ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించామన్నారు.
Samayam Telugu Pawan


అలాగే.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటమే జనసేన లక్ష్యమని పవన్ తన ప్రకటనలో చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నేతలతో సమావేశం నిర్వహించామని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతందని తెలంగాణ ప్రజలకు తెలియజేశారు.

మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల్లో పోటీపై జనసేన ఊగిసలాటలో ఉంది. పోటీలో ఉండాలా.. వద్దా అనేది నిర్ణయం తీసుకోలేదు. చివరి నిమిషంలో బరిలో ఉండాలని తెలంగాణ నేతల నుంచి ఒత్తిడి వచ్చింది.. దీంతో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావించారు. కాని సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికలకు వెళితే.. ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో జనసేనాని వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.