యాప్నగరం

దొరికిన డబ్బులతో నాకేంటి సంబంధం: జూపూడి ప్రభాకర్ రావు

టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నకూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లో బుధవారం రూ.17 లక్షల నగదు లభ్యమైంది.

Samayam Telugu 6 Dec 2018, 5:23 pm
కూకట్‌పల్లిలో పోలీసులకు దొరికిన డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎపీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాలాజీనగర్‌లో నిన్న (డిసెంబర్ 5న) రూ.17 లక్షలను, అవి తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మహాకూటమి విజయం కోసం కృషి చేయడానికే వచ్చానని ఏపీ టీడీపీ నేత జూపూడి తెలిపారు.
Samayam Telugu Jupudi Prabhakar Rao


పోలీసులతో పాటు టీఆర్ఎస్, వైసీపీ కార్యకర్తలు కూడా తమ ఇంట్లోకి వచ్చి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పటివరకూ నాలుగు దఫాలు సోదాలు చేయడా ఒక్క రూపాయి కూడా దొరకలేదని వెల్లడించారు. తన ఇంటి సమీపంలో డబ్బులు దొరికితే, వాటితో తనకు సంబంధం ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దళితులను లెక్క చేయడం లేదని, అందుకే పోలీసులు తనపై నిఘా పెట్టారని చెప్పారు.

ఓవైపు పోలీసులు తనను ఫాలో చేస్తుండగా, మరోవైపు వైసీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సోదాలు చేసేందుకు ఇంట్లోకి రావడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే తన పేరు ప్రతిష్టతలకు భంగం కల్గించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. సోదాల పేరుతో తన ఇల్లు కూడా ధ్వంసం చేయాలని చూశారని ఆరోపించారు.

కాగా, టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నకూకట్‌పల్లిలో బుధవారం రూ.17 లక్షల నగదు లభ్యమైంది. జూపూడి ప్రభాకర్‌రావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సమయంలో ఆయన ఇంటి సమీపంలో డబ్బు మూటతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పోలీసులకు అప్పగించారు. టీడీపీ ధన ప్రవాహంతో కూటమిని గెలిపించాలని యత్నిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.