యాప్నగరం

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థులే గెలవరు!: కడియం శ్రీహరి

తెలంగాణకు శత్రువు కాంగ్రెస్‌ అని, తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం కూటమితో జత కట్టడం దారుణమన్నారు.

Samayam Telugu 5 Dec 2018, 3:43 pm
మహాకూటమి (ప్రజా కూటమి)ని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్‌ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదమని టీఆర్‌ఎస్‌ నేత, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను, పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే కాంగ్రెస్‌ పార్టీ కూటమిని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి నేత సీఎం అభ్యర్థి అని, జిల్లాకు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. వరంగల్‌ అర్బన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి బుధవారం మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu Kadiam Srihari


‘సీఎం అభ్యర్థినంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు సైతం ఎన్నికల్లో తమ గెలుపు కోసం కష్టపడుతున్నారు. కూటమిలో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థులే. అలాంటి కూటమికి ప్రజలు ఓట్లు వేయరు. టీఆర్‌ఎస్‌ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెస్‌ అని, తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం వారితో జత కట్టడం దారుణం. ఒక్కసీటు కూడా గెలిచే ఛాన్స్‌ లేని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ కూటమి కోసం ఓట్లు అడగటం విడ్డూరమని’ కడియం శ్రీహరి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.