తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రోజే కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలం నుంచి పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. కేసీఆర్ ముఖ్య అతిథిగా ఆ సభలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ కాగజ్నగర్ పర్యటన, సభ గురించి పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని వాపోయారు. కోనేరు కోనప్పని గతంలో ఆంధ్రా అప్ప అని పిలిచారని ఈ సందర్భంగా సమ్మయ్య గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీ జెండా మోసిన తనలాంటి వాళ్లను అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ కాగజ్నగర్ పర్యటన, సభ గురించి పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని వాపోయారు. కోనేరు కోనప్పని గతంలో ఆంధ్రా అప్ప అని పిలిచారని ఈ సందర్భంగా సమ్మయ్య గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీ జెండా మోసిన తనలాంటి వాళ్లను అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.