యాప్నగరం

బలరాం నోటికి ఆ మాట ఎట్లొచ్చింది: కేసీఆర్‌

ఇష్టం ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర జీతగాడిగా ఉండు, కానీ కూతలు కూస్తే పాకాలలో కలిపిస్తేమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 23 Nov 2018, 4:37 pm
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా గిరిజనల భూమి సమస‍్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గిరిజనుల జనాభా పెరిగిందని, మీకు రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేసీఆర్‌ జగమొండి. చెప్పింది సాధించి తీరుతాడు. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం. రిజర్వేషన్లు కూడా తీసుకురాలేమా’ అన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.
Samayam Telugu KCR at Mahabubabad


కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఆ కాంగ్రెసాయన పేరేంది. మాజీ ఎంపీ బలరాం నాయక్‌. ఆ పుణ్యాత్ముడు ఎలాంటోడంటే. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయకపోతే మిమ్మల్ని ఆంధ్రాలో కలుపుతా అంటడు. మనమే ఆయనను పాకాలలో కలిపితే పోలే. బలరాం నాయక్‌ ఇష్టం ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర జీతగాడిగా ఉండు. బలరాం లాంటి చీము, నెత్తురు లేనివాళ్ల పుణ్యంతోనే ఇంకా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నాయకుల సంచులు మోస్తున్నారు. మళ్లీ మనకు ఆంధ్రోళ్ల పాలన ఎందుకు.

కాంగ్రెసోళ్లు 1969లో ఉద్యమకారుల్ని చంపారు. రెండోదశ పోరాటంలోనూ కాల్పులు జరిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణ రానివ్వమని చెప్పారు. కానీ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో కాలువల్లో తుమ్మచెట్లు మొలినాయి. చెరువులను నీళ్లతో నింపింది టీఆర్‌ఎస్‌. రైతు బీమా చాలా అద్భుతమైన పథకం. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వస్తాయని మనం కలలో కూడా ఊహించలేదని’ కేసీఆర్‌ ప్రసంగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.