యాప్నగరం

కేసీఆర్‌ నా ప్రత్యర్థిని బలి పశువు చేశారు: దాసోజు శ్రవణ్‌

వక్ఫ్‌ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, స్మార్ట్‌ నియోజకవర్గంగా మార్చి సుపరిపాలన అందిస్తానని దాసోజు శ్రవణ్‌ అన్నారు.

Samayam Telugu 2 Dec 2018, 11:38 pm
గతంతో పోల్చితే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చాలా పుంజుకుంది. అయితే నగరంలోని కొన్ని నియోజకవర్గాల మాట ఎలా ఉన్నా.. ఖైరతాబాద్‌ స్థానం ఫలితంపై అన్ని పార్టీల నేతలతో పాటు నియోజకవర్గ ఓటర్లకు ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్‌ బరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్‌ను బలి పశును చేసేందుకే కేసీఆర్‌ ఆయనకు ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ఇచ్చారని దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు.
Samayam Telugu Dasoju Sravan


దాసోజు శ్రవణ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వక్ఫ్‌ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, స్మార్ట్‌ నియోజకవర్గంగా ఖైరతాబాద్‌ను మారుస్తామని చెప్పారు. 12 అంశాల పరిష్కారానికి 12 టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేసి సుపరిపాలన అందిస్తామన్నారు. ఓవైపు బీజేపీ అభ్యర్థి డబ్బులు పంచి, మద్యం సరఫరా చేసి ఓటర్లను ప్రభావితం చేస్తుంటే.. మరోవైపు దానం నాగేందర్‌ను కేసీఆర్‌ బలి పశువు చేసేందుకు ఈ టిక్కెట్‌ ఇచ్చారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.