యాప్నగరం

తెలంగాణకు గజ్వేల్ ఆదర్శంగా నిలవాలి.. ఈ నెల 14న నామినేషన్ వేస్తున్నా: కేసీఆర్

ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలతో మమేకం కావచ్చు.. సీఎంగా ఆ అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ నెల 14న నామినేషన్ వేస్తున్నా..

Samayam Telugu 11 Nov 2018, 5:04 pm
గజ్వేల్‌ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్ తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో.. నియోజకవర్గ టీఆర్ఎస్‌ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలతో మమేకం కావచ్చన్నారు కేసీఆర్. సీఎంగా తనకు ఆ అవకాశం చాలా తక్కువగా ఉందని.. ప్రజల ఆశీస్సులతో ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 14న నామినేషన్ వేస్తున్నానని.. కార్యకర్తలెవరూ రావొద్దని కోరారు.
Samayam Telugu kcr


గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధే కొంత మాత్రమేనని.. ఇంకా జరగాల్సింది ఉందన్నారు. 18ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చూస్తామన్నారు కేసీఆర్. గజ్వేల్ రైతులు మూడు పంటలు పండించుకునే స్థాయికి రావాలని ఆకాంక్షించిన ఆయన.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి రెండు ఉచిత పాడి గేదెలు ఇస్తామని.. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు రావాలన్నారు. గజ్వేల్‌కు రైలు కూడా పరుగెట్టాలని ఆకాంక్షించారు.

75శాతం పథకాలకు రూపకల్పన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే జరిగిందన్నారు కేసీఆర్. కంటి వెలుగు పథకానికి కారణం ఎర్రవెల్లే అని చెప్పారు. కంటి వెలుగు రూపకల్పనకు రెండు నెలలు కష్టపడ్డామన్నారు. ఇక రైతుబంధు రూపకల్పన ప్రతిపాదినను అధికారులు కుదరదని చెప్పారని.. అయినా సరే సాధ్యం చేసి చూపించామన్నారు. అలాగే రైతు భీమాతో భరోసాను కల్పించామన్నారు. పేదరికానికి కులం లేదనీ.. అది అందరిని దహిస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.