యాప్నగరం

KCR: గజ్వేల్‌లో కేసీఆర్ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే!

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఆయన విజయంతో పాటు టీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేనివిధంగా నిలిపారు.

Samayam Telugu 11 Dec 2018, 4:25 pm
జ్వేల్ నుంచి గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ విజయదుందుభి మోగించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన వంటేరు ప్రతాప రెడ్డిపై 50 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కేసీఆర్‌.. ఈ సారి భారీ మెజార్టీ దక్కించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు సిద్దిపేట, కరీంనగర్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. 2014లో తొలిసారిగా గజ్వేల్ బరిలో నిలిచారు.
Samayam Telugu kcr4


1983, 1985, 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక), 2004లో సిద్దిపేట నుంచి కేసీఆర్ ఎమ్మల్యేగా గెలుపొందారు. అనంతరం కరీంనగర్‌ ఎంపీగా పోటీచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు. 2014లో గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్‌ నుంచి ఎంపీగా పోటీచేశారు. ఫలితాల అనంతరం మెదక్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు..

ఉద్యమ నేతగా ప్రజలు మన్ననలను అందుకున్న కేసీఆర్.. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆది నుంచీ ధీమాగానే ఉన్నారు. ఆ ఆత్మవిశ్వాసంతో ప్రచారంలో చివరి రోజు తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. అందరూ ఊహించినట్టే ఆయన కిందటిసారి కంటే మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు..

Also Read: కేసీఆర్ పదునైన వ్యూహాలు.. టీఆర్‌ఎస్ విజయానికి కారణాలివే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.