యాప్నగరం

KCR: రాంబాబు ఒక్కడే సాయం చేశాడు: కేసీఆర్

రాష్ట్రంలో అత్యధికంగా 85 తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన ప్రాంతమని దేవరకొండ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.

Samayam Telugu 21 Nov 2018, 6:53 pm
‘ఆనాడు ఉద్యమంలో చెప్పిన.. ఇప్పుడు చెబుతున్నా. ఎవ్వరూ వెంటలేని నాడు రాంబాబు అనే యువకుడు మాత్రమే నాకు తోడుగా నిలిచాడని’ తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ చెప్పారు. నల్గొండ జిల్లాలో ఎవరూ తోడురాని కష్ట కాలంలో, పోలీసుల లాఠీ దెబ్బలకు కార్యకర్తల తలలు పగులుతున్నా.. రాంబాబు అనే యువకుడు టీఆర్ఎస్ జెండా ఎగురవేసి జిల్లాలో నాకు తోడుగా నిలిచాడని దేవరకొండ సభలో కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. రాంబాబుకు కచ్చితంగా న్యాయం చేస్తామని, అతడికి చేతనైన సాయం చేస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.
Samayam Telugu KCR At devarakonda


దేవరకొండ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాకు చెందిన నాయిని నర్సింహారెడ్డి నాకు పెద్దన్నలాంటివాడు. హోంమంత్రిగా చేశారు. ఆయన పట్టుబట్టి తన సొంత ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ చేయించారు. దేవరకొండ లంబాడ సోదరులు ఎక్కువగా ఉండే ప్రాంతం. రాష్ట్రంలో అత్యధికంగా 85 తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన ప్రాంతం ఇది. డిండి, నక్కలగండి, కంబాలపల్లి కావచ్చు.. ఎక్కడినుంచైనా మీకు నీళ్లు ఇప్పిస్తాం. 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేవరకు నేను ఊరుకోను.
Read: ఎన్నికలంటే కాంగ్రెస్ గోడలు గీకుతోంది : కేసీఆర్

చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించాం. నాయిని నర్సింహారెడ్డిగారు, నేను, లక్ష్మీకాంత్‌ మరికొందరు జైలుపాలయ్యాం. రాష‍్ట్రం వచ్చాక బాగు చేద్దామంటే కాంగ్రెస్‌ అడ్డంగా మాట్లాడతారు. ఎన్నికలకు వెళ్దామంటే గోడలు గీకుడు మొదలుపెట్టారు. ఎన్నికలకు వెళ్దామంటే కోర్టులకు వెళ్తారు. ఫిర్యాదులు చేస్తారు. ఇంతజరిగి తెలంగాణ తెచ్చుకుంటే చంద్రబాబు ఎందుకు. మళ్లీ తెలంగాణకు ఆంధ్ర పాలన అవసరమా. వచ్చేది ఆంధ్రోడయినా.. తెచ్చేటోడు తెలంగాణవాడు. అలాంటి వాళ్లను దంచాలి. దంచుడంటే మీదపడి కొట్టడం కాదు. మీ విలువైన ఓట్లను టీఆర్‌ఎస్‌కు వేసి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలని’ నల్గొండ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.