యాప్నగరం

Telangana Elections: ఈ ఒక్క ఇల్లు ఆ ఏడు ఇళ్లతో సమానం: కేసీఆర్

కాంగ్రెస్ హయాంలో ఎవరికి కూడా ఉచితంగా ఇళ్లు కట్టలేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోకుండా వంద శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మిస్తుందన్నారు.

Samayam Telugu 19 Nov 2018, 5:18 pm
టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలన్నీ.. తెలంగాణ వచ్చిన తర్వాత అమలుచేస్తున్నామని కేసీఆర్ అన్నారు.
Samayam Telugu KCR1


ప్రతిపక్షాలు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారా? దళితులకు మూడెకరాల భూమి ఎక్కడిచ్చారు? అని విమర్శలు చేస్తున్నాయని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ఒక్క ఇల్లు.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కట్టిన ఏడు ఇళ్లతో సమానమని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎవరికి కూడా ఉచితంగా ఇళ్లు కట్టలేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోకుండా వంద శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మిస్తుందన్నారు. ఆడవాళ్ల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపడుతోందని కేసీఆర్ అన్నారు.

ఇవాళ బరిలో ఉన్న పెద్దలు 58 ఏళ్లు పాలించారు. కాని టీఆర్ వచ్చింది 2014లో. కానీ ఈ నాలుగున్నరేళ్లలో అనేక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశాం. అవకాశం ఉన్న కూడా అభివృద్ధి చేయలేదని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తెలంగాణలో రూ.43 వేల కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.