యాప్నగరం

నేడు నామినేషన్ వేయనున్న కేసీఆర్.. కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

Samayam Telugu 14 Nov 2018, 7:13 am
నేడు (నవంబరు 14) గజ్వేల్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేటలోని తన ఇష్టదైవమైన కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం కేసీఆర్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు కేసీఆర్‌ కోనాయిపల్లికి చేరుకుని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహం వద్ద నామినేషన్‌ పత్రాలను ఉంచి పూజలు చేసిన తర్వాత ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.
Samayam Telugu kcr-announces


1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లికి రానున్నందున అక్కడ హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఏర్పాట్లను హరీష్ రావు స్వయంగా పరిశీలించారు. అలాగే సిద్ధిపేటలో హరీష్ రావు సర్వ మత ప్రార్థనలు నిర్వహించి, తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.