యాప్నగరం

TRS Public Meetings: నేడు 9 ప్రచార సభల్లో ప్రసంగించనున్న కేసీఆర్

సోమవారం వివిధ జిల్లాల పరిధిలో జరిగే తొమ్మిది ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్ననున్నారు.

Samayam Telugu 26 Nov 2018, 10:36 am
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాశీర్వాద సభలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రచారానికి ఇంకా పదిరోజులే సమయం ఉండటంతో గులాబీబాస్ ప్రచారజోరును వేగవంతం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న కేసీఆర్ సోమవారం (నవంబరు 26) కూడా వివిధ జిల్లాల పరిధిలో జరిగే తొమ్మిది ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్ననున్నారు. కామారెడ్డి, నిజమాబాద్ రూరల్, బోధన్, మోర్తాడ్, జగిత్యాల, పరకాల, కరీంనగర్, స్టేషన్ ఘన్‌‌పూర్, వరంగల్ సభల్లో పాల్గొనున్నారు.
Samayam Telugu kcr


షెడ్యూలు ఇలా...

* ఉదయం 11 గంటలకు కామారెడ్డి బహిరంగ సభ.
* ఉదయం 11.45 గంటలకు నిజామాబాద్ రూరల్‌లో బహిరంగ సభ.
* మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్ బహిరంగ సభ.
* మధ్యాహ్నం 1.15 గంటలకు బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడులో ప్రచారం చేస్తారు.
* మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలోని ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాలతో ఉమ్మడి సభ ఉంటుంది.
* మధ్యాహ్నం 2.45 గంటలకు కరీంనగర్‌లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభ జరుగుతుంది.
* మధ్యాహ్నం 3.30 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ బహిరంగ సభ.
* సాయంత్రం 4.15 గంటలకు పరకాల బహిరంగ సభ.
* సాయంత్రం 5 గంటలకు వరంగల్‌లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభలో కేసీఆర్ పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.