యాప్నగరం

Kodandaram: ఏడుగురు అభ్యర్థులకు టీజేఎస్ బీఫారాలు

టీడీపీ తరుపున ఎర్రశేఖర్ బరిలో ఉన్న మహబూబ్ నగర్ స్థానంలో రాజేందర్‌రెడ్డిని టీజేఎస్ ప్రకటించి అతడికి బీఫారం అందజేసింది.

Samayam Telugu 18 Nov 2018, 8:43 pm
మహాకూటమిలో భాగస్వామి అయిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు చెందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ తమ అభ్యర్థులకు ఆదివారం బీఫారాలు అందజేసింది. అయితే సీట్లు ప్రకటించిన నాలుగు స్థానాలతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. టీడీపీ తరుపున ఎర్రశేఖర్ బరిలో ఉన్న మహబూబ్ నగర్ స్థానంలో రాజేందర్‌రెడ్డిని టీజేఎస్ ప్రకటించింది.
Samayam Telugu TJS Candidates


పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్ స్థానం టీడీపీకి కేటాయించినా.. ఆ స్థానంలో కోదండరామ్ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. మల్కాజిగిరి - దిలీప్‌ కుమార్‌ కపిలవాయి, మెదక్‌ - జనార్దన్‌రెడ్డి, దుబ్బాక -చిందం రాజ్‌కుమార్‌, సిద్దిపేట - భవానీరెడ్డిలు బీఫారాలు అందుకున్న వారిలో ఉన్నారు. వరంగల్ తూర్పు, మిర్యాలగూడ సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని టీజేఎస్ నేతలు చెబుతున్నారు.

టీజేఎస్ నుంచి బీఫారాలు అందుకున్న నేతలు
మల్కాజిగిరి - దిలీప్‌ కుమార్‌ కపిలవాయి
మెదక్‌ - జనార్దన్‌రెడ్డి
దుబ్బాక -చిందం రాజ్‌కుమార్‌
సిద్దిపేట - భవానీరెడ్డి
వరంగల్‌ తూర్పు-ఇన్నయ్య
మిర్యాలగూడ-విద్యాధర్‌రెడ్డి
మహబూబ్‌నగర్- రాజేందర్‌రెడ్డి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.