ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమంటున్నారు మాజీ మంత్రి, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో మాట్లాడిన కోమటిరెడ్డి.. గురువారం జరిగిన టీఆర్ఎస్ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు కోమటిరెడ్డి. రౌడీలకు, దోపిడీ దారులకు టీఆర్ఎస్ టిక్కెట్లు ఇచ్చారని.. రౌడీలను గెలిపిస్తే నల్గొండలో హత్యలు, దోపిడీలేనన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ విజయం సాధించని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన సవాల్ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వీకరించాలన్నారు. బతుకమ్మ చీరల పేరుతో గులాబీ నేతలు వందల కోట్లు దోచుకుంటున్నారని.. మంత్రివర్గంలోకి మహిళలను ఎందుకు తీసుకోలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కోమటిరెడ్డి.
టీఆర్ఎస్ సర్కార్ గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ను మూసివేస్తామన్నారు. ఈ ప్లాంట్ల వల్ల మిర్యాలగూడ పరిసరాలు కాలుష్యమవుతున్నాయని.. వేల కోట్ల కమీషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఆపధ్దర్మ మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్ను నిర్మిస్తున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ విజయం సాధించని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన సవాల్ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వీకరించాలన్నారు. బతుకమ్మ చీరల పేరుతో గులాబీ నేతలు వందల కోట్లు దోచుకుంటున్నారని.. మంత్రివర్గంలోకి మహిళలను ఎందుకు తీసుకోలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కోమటిరెడ్డి.
టీఆర్ఎస్ సర్కార్ గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ను మూసివేస్తామన్నారు. ఈ ప్లాంట్ల వల్ల మిర్యాలగూడ పరిసరాలు కాలుష్యమవుతున్నాయని.. వేల కోట్ల కమీషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఆపధ్దర్మ మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్ను నిర్మిస్తున్నారన్నారు.