యాప్నగరం

రాహుల్ సిగ్గుపడాలి: కాంగ్రెస్‌కు కేటీఆర్ కౌంటర్

రైతుల ఆత్మహత్యలు గురించి మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటూ ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Samayam Telugu 20 Oct 2018, 9:31 pm
తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభల్లో కేసీఆర్, మోదీలపై విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ ఆయన ఆరోపణల్నీ అవాస్తవాలని కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.
Samayam Telugu Untitledqq


ఆ రెండూ అబద్దాలే: రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో రెండు శుద్ధ అబద్ధాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ప్రాణిహిత చేవెళ్లకు అంబేద్కర్ పేరును తొలగించారనడంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్‌కు ఇచ్చిన గౌరవం ఏమిటో అందరికీ తెలుసన్నారు. ఆయన చనిపోయిన 34 ఏళ్ల వరకు భారతరత్న ఇవ్వలేదన్నారు. ఆ పురస్కారం ఇచ్చింది కూడా వీపీ సింగ్ ప్రభుత్వమే కానీ, కాంగ్రెస్ కాదని తెలిపారు. ఢిల్లీలో పీవీ సమాధి నిర్మాణానికి కూడా వారు అంగీకరించలేదన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల వ్యయాన్నిరూ.17 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లకు ఎందుకు పెంచారో కాంగ్రెస్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెప్పాలన్నారు. ఎక్కువ ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులను రిడిజైన్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టుకు డిజైన్ చేస్తే.. తమ ప్రభుత్వం 160 టీఎంసీలకు పెంచిందన్నారు.

రాహుల్ సిగ్గుపడాలి: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన వల్లే రైతులు ఆత్మహత్యులు చేసుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇందుకు సిగ్గుపడాలన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతున్నాయని కేంద్రమే చెప్పిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.