యాప్నగరం

టీఆర్ఎస్ నెగ్గుతుంది: లగడపాటి పద్మ

ఓ వైపు లగడపాటి రాజగోపాల్ ప్రజా కూటమి విజయం సాధిస్తుందని సర్వే వివరాలు వెల్లడించగా.. మరోవైపు ఆయన భార్య పద్మ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడం గమనార్హం.

Samayam Telugu 6 Dec 2018, 1:33 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కంటే ప్రజా కూటమికే నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కొన్ని వివరాలు వెల్లడించారు. అయితే తనకు ఇచ్చిన సర్వే రిపోర్టుల్లో టీఆర్ఎస్ దాదాపు 70 సీట్లు నెగ్గుతుందని చెప్పిన లగడపాటి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు వివరాలు చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
Samayam Telugu Lagadapati Padma


అందుకు సంబంధించిన వివరాలను, లగడపాటితో చేసిన చాటింగ్‌ను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అది పాత సర్వే అని లగడపాటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సతీమణి అనితతో కలిసి లగడపాటి రాజగోపాల్ భార్య పద్మ మంగళవారం రాత్రి స్థానికంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. మా అన్న దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరుతున్నాను. ఏ కొత్త ప్రభుత్వం ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేయలేదు. మరో ఐదేళ్లు అధికారం ఇస్తే ప్రారంభించిన పనులు, కార్యక్రమాలు పూర్తవుతాయి. అలా జరగలాంటే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలి. కారు గుర్తుకు ఓటేసి ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్‌ను గెలిపించాలని’ స్థానికులకు పిలుపునిచ్చారు.
Read: చంద్రబాబు ఒత్తిడితో లగడపాటి సర్వే తారుమారు: కేటీఆర్‌
Read: లగడపాటి సర్వే.. హస్తమా, హంగా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.