ఎన్నికల సర్వేల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వివరాలు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ సర్వే బృందం 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో మాత్రమే సర్వే చేయగలిగిందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి 2వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారన్నారు. ఇంకో మూడు స్థానాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని, పోలింగ్కు ముందు వివరాలు చెప్పొద్దని కోరాడంతో ఆ వివరాలు తెలపడం లేదని తెలిపారు.
Read Also: 2014లో లగడపాటి ఏం చెప్పారు? సర్వేలో నిజమెంతా?
ప్రజా కూటమిదే గెలుపు: టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని లగడపాటి తెలిపారు. అయితే, పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలు మారవచ్చన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఏయే జిల్లాల్లో ఎలా?: లగడపాటి సర్వే ప్రకారం.. హైదరాబాద్లో అత్యధిక సీట్లు ఎంఐఎంకు వెళతాయి. మిగతా స్థానాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్కు దక్కుతాయి. వరంగల్, నిజామాబాద్, మెదక్లో టీఆర్ఎస్; ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటాయి. కరీంనగర్, మహబూబ్నగర్లో హోరాహోరీ తప్పదు.
నేను చెబితేనే నమ్మండి: ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తాను పూర్తి వివరాలను ఇప్పుడు చెప్పలేనని, పోలింగ్ తర్వాత సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని లగడపాటి అన్నారు. గత ఎన్నికల వలె పోలింగ్ శాతం 68.5 నమోదైతే.. తన సర్వే అంచనాలు నిజమవుతాయని తెలిపారు. ఇటీవల తన పేరుతో చాలా సర్వేలు వస్తున్నాయని, కొన్ని తనకు కూడా చేరాయని లగడపాటి అన్నారు. వాటిని అస్సలు నమ్మవద్దని, తాను స్వయంగా వివరాలను చెబితేనే నమ్మాలని లగడపాటి అన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి 2వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారన్నారు. ఇంకో మూడు స్థానాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని, పోలింగ్కు ముందు వివరాలు చెప్పొద్దని కోరాడంతో ఆ వివరాలు తెలపడం లేదని తెలిపారు.
Read Also: 2014లో లగడపాటి ఏం చెప్పారు? సర్వేలో నిజమెంతా?
ప్రజా కూటమిదే గెలుపు: టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని లగడపాటి తెలిపారు. అయితే, పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలు మారవచ్చన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఏయే జిల్లాల్లో ఎలా?: లగడపాటి సర్వే ప్రకారం.. హైదరాబాద్లో అత్యధిక సీట్లు ఎంఐఎంకు వెళతాయి. మిగతా స్థానాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్కు దక్కుతాయి. వరంగల్, నిజామాబాద్, మెదక్లో టీఆర్ఎస్; ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటాయి. కరీంనగర్, మహబూబ్నగర్లో హోరాహోరీ తప్పదు.
నేను చెబితేనే నమ్మండి: ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తాను పూర్తి వివరాలను ఇప్పుడు చెప్పలేనని, పోలింగ్ తర్వాత సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని లగడపాటి అన్నారు. గత ఎన్నికల వలె పోలింగ్ శాతం 68.5 నమోదైతే.. తన సర్వే అంచనాలు నిజమవుతాయని తెలిపారు. ఇటీవల తన పేరుతో చాలా సర్వేలు వస్తున్నాయని, కొన్ని తనకు కూడా చేరాయని లగడపాటి అన్నారు. వాటిని అస్సలు నమ్మవద్దని, తాను స్వయంగా వివరాలను చెబితేనే నమ్మాలని లగడపాటి అన్నారు.