యాప్నగరం

తెలంగాణలో మావోల కదలికలు.. నేతలే టార్గెట్‌గా రెక్కీ?

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు.. నేతలే టార్గెట్‌గా రెక్కీలు.. అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్ ముమ్మరం..

Samayam Telugu 15 Nov 2018, 12:16 pm
ఎన్నికల వేళ తెలంగాణలో మావోల కదలికలు మొదలయ్యాయా.. నేతలే టార్గెట్‌గా రెక్కీలు నిర్వహించారా.. అవునంటున్నాయి నిఘా వర్గాలు. ఉత్తర తెలంగాణలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లు తేల్చాయి. పోలీసులంతా ఎన్నికల హడావిడిలో బిజీగా ఉండటంతో.. ప్రజా ప్రతినిధులపై దాడికి స్కెచ్ వేసినట్లు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆరుగురు మావోలు భూపాలపల్లి జిల్లాలో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఆరుగుర్ని లింగయ్య, మంగు, రమేష్, గంగ, మంగతు, పండులుగా గుర్తించారు. వారి ఫోటోలను కూడా విడుదల చేసి.. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని పోస్టర్లు అంటించారు.
Samayam Telugu mavos


భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మావోలు సంచరించినట్లు పోలీసులు చెబుతారు. తాడ్వాయిలో వారు బైక్‌పై తిరిగినట్లు తెలుస్తోంది. ఈలోపే పోలీసు బలగాలు కంటపడటంతో.. అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. నక్సల్స్‌కు ఇద్దరు స్థానికులు ఆశ్రయం ఇచ్చినట్లు తెలియడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం మేరకే ఆరుగురు మావోలను గుర్తించారు.

మావోల కదలికలకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నక్సల్స్ ముగ్గురు నలుగురుగా విడిపోయి.. రెక్కీలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, అటవీ ప్రాంతాలతో పాటు ఖమ్మం సరిహద్దులోని గుండాల, చర్ల, భద్రాచలం అటవీ ప్రాంతాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. నేతలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.