యాప్నగరం

ఎన్నికల సంఘంపై మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపణలు

భన్వర్‌లాల్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా కేసీఆర్ మాత్రం ఓట్లను తొలగించి తన పంతం నెగ్గించుకున్నారని చెప్పారు.

Samayam Telugu 22 Oct 2018, 10:24 pm
ఓవైపు టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తుంటే.. మరోవైపు మహాకూటమి నేతలు మాత్రం ఓటర్ల జాబితాలో అవకతవకలంటూ కాలయాపన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం దారుణంగా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులు కోర్టులను తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu Marri Shashidhar Reddy


సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఓట్ల సంఖ్య తగ్గిపోతుందని తాము చెబుతుంటే మరోవైపు దాదాపు 15 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ అప్పటి సీఈవో భన్వర్‌లాల్‌ను ఆదేశించారని గుర్తుచేశారు. భన్వర్‌లాల్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా కేసీఆర్ మాత్రం ఓట్లను తొలగించి తన పంతం నెగ్గించుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేసీఆర్ పాలన చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కీలకనేత శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.