వీడియో: జిమ్లో అసదుద్దీన్.. ఎన్నికల ‘కసరత్తు’లు!
ప్రత్యర్థులపై తనదైన శైలిలో పొలిటికల్ పంచ్లు విసిరే ఎంఐఎం అధిపతి అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్నికల వేళ జిమ్ బాయ్ అవతారం ఎత్తారు. కసరత్తులతో యువతకు సవాల్ విసిరారు.
Samayam Telugu 22 Mar 2019, 3:11 pm
ప్రధానాంశాలు:
- ప్రత్యర్థులకు పొలిటికల్ పంచులు వేసే అసదుద్దీన్ ఒవైసీ యువతకు ఫిట్నెస్ సవాలు విసిరారు.
- హైదరాబాద్లో ప్రచారంలో భాగంగా జిమ్లో కసరత్తులు చేశారు.
- తనదైన శైలిలో ప్రచారంలో దూసుకు పోతున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో వెరైటీ పనులు చేస్తున్నారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ అడుగు ముందుకేశారు. ‘జిమ్ బాయ్’ అవతారమెత్తారు. ఓ జిమ్లోకి వెళ్లి సరదాగా కసరత్తులు చేశారు. వయసు పైబడుతున్నా.. యువకుడిలా కసరత్తులు చేశారు. ప్రత్యర్థులకు పొలిటికల్ ‘పంచ్’లు వేసే అసదుద్దీన్.. ఫిట్నెస్పై యువకులకు సవాల్ విసిరారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ‘జిమ్ ఫీట్’ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం తరఫున హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వరసగా మూడు పర్యాయాలు (2004, 2009, 2014) విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి నాలుగోసారి బరిలోకి దిగారు. వివిధ వర్గాలను ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read: ఎంఐఎం చరిత్ర.. రజాకార్ల పార్టీ అని ఎందుకు చెప్పుకోరంటే
1994లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అసదుద్దీన్.. 1994, 1999 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటివరకూ హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చిన తన తండ్రి సలావుద్దీన్ ఆరోగ్యం క్షీణించడంతో 2004లో లోక్ సభకు బరిలోకి దిగారు. 70 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది.
తన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం తరఫున హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వరసగా మూడు పర్యాయాలు (2004, 2009, 2014) విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి నాలుగోసారి బరిలోకి దిగారు. వివిధ వర్గాలను ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read: ఎంఐఎం చరిత్ర.. రజాకార్ల పార్టీ అని ఎందుకు చెప్పుకోరంటే
1994లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అసదుద్దీన్.. 1994, 1999 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటివరకూ హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చిన తన తండ్రి సలావుద్దీన్ ఆరోగ్యం క్షీణించడంతో 2004లో లోక్ సభకు బరిలోకి దిగారు. 70 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది.