యాప్నగరం

Telangana Polls 2018: బంజారాహిల్స్‌లో ఓటు వేసిన KTR

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు..

Samayam Telugu 7 Dec 2018, 2:27 pm
మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉన్న సెయింట్ నిజామిస్ స్కూల్ లో కేటీఆర్ తన ఓటు వేశారు. ఓటు వేసేందుకు అందరితో పాటూ మంత్రి కూడా క్యూలో నిలబడ్డారు. కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు యూత్ పోటీపడ్డారు. ఓటు వేయడం ఓ బాధ్యతని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Samayam Telugu ktr.


కేటీఆర్ సతీమణి శైలిమ.. హైదరాబాద్‌ హిమాయత్ న‌గ‌ర్‌లోని సెయింట్ అంథోనిస్ స్కూల్లో ఓటు వేశారు. ఇటు సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని చింతమడకలో సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.