యాప్నగరం

KTR: చంద్రబాబు గోబెల్స్ అన్న.. ఆ సర్వేను నమ్మొద్దు

గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రజలు గందరగోళపడొద్దు.

Samayam Telugu 5 Dec 2018, 7:03 pm
తెలంగాణ ఎన్నికల్లో సర్వేల లొల్లి నడుస్తోంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీఆర్ఎస్ మండిపడుతోంది. రాజగోపాల్‌ది చిలక జోస్యమంటూ సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్.. ఆ సర్వేను కొట్టిపారేశారు. నవంబర్‌ 20న రాజగోపాల్‌ తనకు పంపిన ఓ వాట్సాప్ మెసేజ్‌ను బయటపెట్టారు. ఈ సర్వేపై తాజాగా మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు దొంగ ప్రచారమని.. తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మొద్దంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Samayam Telugu ktr.


కేటీఆర్ తన ట్వీట్‌లో ‘గోబెల్స్ కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది అన్నారు’.కేటీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.