తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్పై పెద్ద దుమారమే రేగింది. రేవంత్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్ను టార్గెట్ చేశాయి. టీఆర్ఎస్ కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని.. అర్థరాత్రి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని విమర్శనాస్త్రాలు సంధించారు హస్తం పార్టీ నేతలు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. కూటమి టార్గెట్గా ట్వీట్ బాంబ్ పేల్చారు.
ట్వీట్లో ‘ మహాకూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు. కానీ సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనే సుప్రీం. కొడంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తారనే ముందస్తు అరెస్టుకు ఎన్నికల కమిషనే ఆదేశించింది’అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్లో ‘ మహాకూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు. కానీ సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనే సుప్రీం. కొడంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తారనే ముందస్తు అరెస్టుకు ఎన్నికల కమిషనే ఆదేశించింది’అంటూ ట్వీట్ చేశారు.