యాప్నగరం

కూకట్‌పల్లిలో డబ్బు కట్టల కలకలం.. పోలీసుల సోదాలు

జూపుడి ఇంటి వెనుకవైపు నుంచి డబ్బుతో పారిపోతున్న ఓ యువకుడు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల చేతికి చిక్కాడు. డబ్బుతో దొరకిపోయిన అతడ్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 6 Dec 2018, 12:04 am
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సుహాసిని విజయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ప్రచారం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో డబ్బు కట్టులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌జూపుడి ప్రభాకర్‌రావు ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Samayam Telugu Money


ఇదే సమయంలో జూపుడి ఇంటి వెనుకవైపు నుంచి డబ్బుతో పారిపోతున్న ఓ యువకుడు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల చేతికి చిక్కాడు. డబ్బుతో దొరకిపోయిన అతడ్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద ఉన్న నగదు రూ. 17.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు డబ్బు సంచులతో పారిపోయినట్లు సమాచారం. జూపుడి ఇంట్లో తనిఖీలు జరిగిన సమయంలో ఆయన ఇంటి సమీపంలో డబ్బు దొరకడం చర్చనీయాంశమైంది. జూపుడి డబ్బులు పంచుతున్నారని ఆరోపించిన స్ఠానిక టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి ప్లాన్‌ ప్రకారమే డబ్బులు తెచ్చి జూపుడి ప్రభాకర్‌ ఇంట్లో పెట్టారని ఆరోపించారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి ప్రచారం కోసం పంచేందుకు తెచ్చిన డబ్బును, పోలీసుల తనిఖీతో బయటపడేశారని చెప్పారు. ఒక్క వ్యక్తిని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.