యాప్నగరం

ఊడిన ప్రచార రథం చక్రాలు.. వీహెచ్‌కు తప్పిన పెను ప్రమాదం

వీహెచ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి.

Samayam Telugu 21 Nov 2018, 10:29 pm
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు (వీహెచ్)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథం ప్రమాదానికి గురైంది. ప్రచార రథం రెండు చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం వద్ద బుధవారం (నవంబర్ 21) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
Samayam Telugu vh


సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి తరఫున వీహెచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం అదే వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు పయనమవగా.. నేరెళ్ల గ్రామ శివార్లో ఆయన ప్రచార రథం ప్రమాదానికి గురైంది..

ప్రచార రథం రెండు చక్రాలు ఊడిపోయి రోడ్డుకు ఇరువైపులా పడ్డాయి. ఆ సమయంలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని అదుపు చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వీహెచ్ సహా ప్రచార రథంలో ఉన్నవారందరూ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.