యాప్నగరం

Kodad: ఉత్కంఠ నడుమ ఉత్తమ్ భార్య ఓటమి..!

కోదాడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గ్రామాల ఓటర్లకి చెందిన ఈవీఎంలు మొరాయించాయి. దీంతో.. వీవీప్యాట్‌ స్లిప్‌ల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయించారు.

Samayam Telugu 12 Dec 2018, 10:13 am
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు తాజాగా ముగిసింది. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ, వివాదాల నడుమ ఆసక్తిరేపిన కోదాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య స్వల్ప మెజారీటీతో గెలుపొందారు. సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గ్రామాల ఓటర్లకి చెందిన ఈవీఎంలు మొరాయించాయి. దీంతో.. వీవీప్యాట్‌ స్లిప్‌ల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయించగా.. దానిపై కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Samayam Telugu 01


కానీ.. అధికారులు మాత్రం లెక్కింపుని కొనసాగించడంతో.. ఆమె పెద్ద ఎత్తున నిరసన తెలపింది. దీంతో కాసేపు కౌటింగ్‌ నిలిచిపోయింది. కానీ.. ఆ తర్వాత మళ్లీ కలెక్టర్ చొరవతో లెక్కింపు కొనసాగగా.. 668 ఓట్ల తేడాతో పద్మావతి పరాజయాన్ని చవిచూసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 స్థానాలకి ఎన్నికలు జరగగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్, టీడీపీతో సహా మహాకూటమిలోని పార్టీలన్నీ కలిపి 21 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక అన్ని స్థానాల్లోనూ పోటీపడిన బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని (గోషామహల్‌) గెలుపొందగా.. మజ్లిస్‌ 7 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.