యాప్నగరం

పదవులకు ఇద్దరు టీఆర్ఎస్ నేతల రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి బరిలోకి దిగి విజయం సాధించారు.

Samayam Telugu 13 Dec 2018, 11:37 pm
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు టీఆర్ఎస్ నేతల రాజీనామాలను శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆమోదించినట్లు సమాచారం.
Samayam Telugu Narender reddy


అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి బరిలోకి దిగి విజయం సాధించారు. కొడంగల్ నుంచి పోటీచేసిన నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విజయం సాధించగా, మల్కాజ్‌గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి గెలుపొందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.