తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలంటే కారు ఆగకూడదని, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ‘కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ను కూటమిలోని పార్టీలు కరివేపాకులా వాడుకుని పక్కన పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీట్లు పంచుకునేందుకే కూటమి పార్టీలకు 70 రోజులు పడితే.. అధికారంలోకొచ్చి పాలన చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుందోనంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ‘సారు+కారు= సర్కారు’ అనే మాట వినిపిస్తోందని చెప్పారు. కాగా, మహాకూటమి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో నిర్ణయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెత్తనం, అమరావతి పెత్తనం పోవాలంటే మళ్లీ కారుకే పట్టం కట్టాలంటూ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. .
కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ‘కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ను కూటమిలోని పార్టీలు కరివేపాకులా వాడుకుని పక్కన పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీట్లు పంచుకునేందుకే కూటమి పార్టీలకు 70 రోజులు పడితే.. అధికారంలోకొచ్చి పాలన చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుందోనంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ‘సారు+కారు= సర్కారు’ అనే మాట వినిపిస్తోందని చెప్పారు. కాగా, మహాకూటమి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో నిర్ణయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెత్తనం, అమరావతి పెత్తనం పోవాలంటే మళ్లీ కారుకే పట్టం కట్టాలంటూ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. .