యాప్నగరం

Telangana Elections: తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్.. యువతకు రిక్వెస్ట్

తెలంగాణ ఎన్నికల రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువతకు ఆయన రిక్వెస్ట్ పంపారు.

Samayam Telugu 7 Dec 2018, 9:16 am
తెలంగాణ ప్రజానీకం ఓటెత్తుతోంది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరుతున్నారు. పలువురు సెలబ్రిటీలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌కు దీటుగా మహాకూటమి ప్రచారం సాగడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయనే అంచనాలున్నాయి.
Samayam Telugu modi req


శుక్రవారం నాడు తెలంగాణతోపాటు రాజస్థాన్‌లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

‘ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాన’ని మోదీ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.