యాప్నగరం

Nizamabad Rally: నేడు తెలంగాణకు మోదీ.. ట్విట్టర్ ద్వారా తెలుగులో సందేశం

నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు.

Samayam Telugu 27 Nov 2018, 11:25 am
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలనాథలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ప్రచారపర్వంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మంగళవారం (నవంబరు 27) తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ ద్వారా తెలుగులో ముందస్తు సందేశం వినిపించారు. 'రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
Samayam Telugu modi



డిసెంబరు 3న మరోసారి..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 3న మరోసారి తెలంగాణ ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. డిసెంబరు 3న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం హైదరాబాద్ బహిరంగ సభతో పాటు ఏదో ఒక జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనాలని కోరుతున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.