యాప్నగరం

సుహాసిని తరఫున ప్రచారం.. చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున ప్రచారం చేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అంతా సిద్ధం చేసుకున్నారు.

Samayam Telugu 28 Nov 2018, 11:06 pm
ఖమ్మంలో బుధవారం జరిగిన బహిరంగ సభతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే అదేరోజు చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూకట్‌పల్లిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కూకట్‌పల్లిలో ఈ 29న ప్రజాకూటమిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున ప్రచారం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.
Samayam Telugu Chandrababu


కూకట్‌పల్లిలో గురువారం చంద్రబాబు ఎన్నికల ప్రచారం, రోడ్‌ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌ నగరంలో ఇదివరకే ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్‌ కీలకనేత కేటీఆర్‌ రోడ్‌ షోలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మరో పార్టీకి చెందిన నేత రోడ్‌షోలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. తన తొలిరోజు ప్రచారం ఖమ్మంలో చేయగా, రెండోరోజు నందమూరి సుహాసిని తరఫున ప్రచారం చేయాలనుకున్న చంద్రబాబుకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడం గమనార్హం. గురువారం రోజు చంద్రబాబు రోడ్‌షో, ప్రచారానికి పర్మిషన్‌ ఎప్పుడు ఇస్తారన్నది తెలిసే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.