యాప్నగరం

ఎన్నికల ప్రలోభాలు.. కాజీపేటలో రూ.3.5కోట్లు సీజ్

ఓటర్లకు ప్రలోభాల పర్వం.. ధన ప్రవాహం పారిస్తున్న అభ్యర్థులు.. తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న డబ్బు.

Samayam Telugu 6 Dec 2018, 4:09 pm
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు గంటలే వ్యవధే ఉంది. ప్రచారంతో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు నోట్ల ప్రలోభాలను మొదలు పెట్టారు. స్థానిక నేతల సాయంతో.. ధన ప్రవాహాన్ని పారిస్తున్నారు. డబ్బు పంచే క్రమంలో.. అక్కడక్కడా పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా వరంగల్‌లోని కాజీపేటలో డబ్బు భారీగా పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న రూ.3.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu cash


కాజీపేటలో తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రావిన్స్‌రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రావిన్స్ రెడ్డిని ఆరా తీయగా.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన మరో రూ.3కోట్ల59లక్షల19వేల మొత్తాన్ని కాంగ్రెస్‌ నేత అమృతరావు బంధువు ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు. అక్కడా సోదాలు చేయగా డబ్బులు దొరికగా.. ఈ డబ్బును వర్ధన్నపేట ప్రజా కూటమి అభ్యర్థి దేవయ్యదిగా గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.