యాప్నగరం

‘ముహూర్తం చూసుకుని ప్రగతిభవన్ వీడనున్న కేసీఆర్’

ఓటమి భయంతో, అసహనంతోనే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, వంశీచంద్ రెడ్డిలపై దాడులు జరిగాయని కుసుమ కుమార్ ఆరోపించారు.

Samayam Telugu 8 Dec 2018, 3:18 pm
తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోరుకు ప్రజా కూటమి బ్రేకులు వేసిందన్నారు కాంగ్రెస్ నేత కుసుమ కుమార్. తమ అభ్యర్థులు 65 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి కూటమి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రగతిభవన్‌ను ఖాళీ చేసేందుకు ముహూర్తం చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేపట్టేందుకు కేసీఆర్ ముహూర్తాలు చూస్తారని, ప్రగతిభవన్‌ నుంచి వెళ్లిపోయేందుకు అదే చేయాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ మీడియాలు తెలంగాణ ప్రజల నాడిని పట్టుకోలేకపోయాయని పేర్కొన్నారు. ఓటమి భయంతో, అసహనంతోనే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, వంశీచంద్ రెడ్డిలపై దాడులు జరిగాయని ఆరోపించారు.
Samayam Telugu Kusuma Kumar


అప్రమత్తంగా ఉండాలి
డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిరుద్యోగ భృతిని టీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టో నుంచే కాపీ కొట్టిందని, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కుసుమ కుమార్ అభిప్రాయపడ్డారు. లగడపాటి రాజగోపాల్ సర్వేలోనూ ప్రజా కూటమిదే అధికారమని వెల్లడించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.