యాప్నగరం

Telangana Polls 2018: టీడీపీకి తప్పని రెబల్స్ బెడద

టీడీపీకి తప్పని రెబల్స్ గుబులు.. ఎన్నికల బరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న రెబల్స్.

Samayam Telugu 15 Nov 2018, 2:34 pm
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ గుబులు మొదలయ్యింది. టీఆర్ఎస్‌ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. మహా కూటమికి మాత్రం రెబల్స్ టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగుతుంటే.. 14 స్థానాలకే పరిమితమైన టీడీపీకి కూడా ఈ తలనొప్పి తప్పలేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట.
Samayam Telugu tdp


గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకమైన శేరిలింగంపల్లి సీటు ఆశించిన మొవ్వా సత్యనారాయణకు నిరాశ తప్పలేదు. దీంతో రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారట. ఇక కోదాడ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న బొల్లం మల్లయ్య యాదవ్‌‌ది కూడా ఇదే పరిస్థితి. కుదిరితే రెబల్‌గా లేని పక్షంలో బీజేపీలో చేరాలని భావిస్తున్నారట. ఆలేరు టికెట్ వస్తుందనుకున్న బండ్రు శోభారాణికి నిరాశే మిగిలింది. ఆమె కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఖైరతాబాద్ నుంచి బీఎన్ రెడ్డి.. దేవరకద్ర నుంచి సీతాదయాకర్ రెడ్డి నామినేషన్లు వేయబోతున్నారట.

ఈ మధ్యే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా పటాన్ చెరు టికెట్ మీద ఆశ పెట్టుకున్నారు. కాని సీటు రాకపోవడంతో.. రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారట. ఇబ్రహీంపట్నం సీటు వస్తుందనుకున్న రొక్కం భీంరెడ్డికు నిరాశ మిగిలింది. ఈ సీటును సామ రంగారెడ్డికి కేటాయించడంతో.. ఆయన కూడా రెబల్‌గా నామినేషన్ వేస్తానని చెబుతున్నారట. మరి ఈ రెబల్స్‌ను బుజ్జగించడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారగా.. నామినేషన్ల ఉపసంహరణ నాటికి అంతా సర్థుకుంటుందని నేతలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.