యాప్నగరం

కేసీఆర్‌ మోదీకి జీతగాడు.. టీఆర్ఎస్‌కు షాక్ తప్పదు: రేవంత్

2014 ఎన్నికల్లో 63సీట్లు దక్కించుకున్న కేసీఆర్.. మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని నూరు చేసుకున్నారు. ఆ నూరు రద్దు చేసి.. మళ్లీ నూరు ఎందుకు గెలవాలనుకుంటున్నట్లో చెప్పాలి.

Samayam Telugu 7 Oct 2018, 5:58 pm
కేసీఆర్‌కు ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ముందస్తు ఎన్నికలకు కారణమేంటో చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో 63సీట్లు దక్కించుకున్న కేసీఆర్.. మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని నూరు చేసుకున్నారన్నారు. ఆ నూరు రద్దు చేసి.. మళ్లీ నూరు ఎందుకు గెలవాలనుకుంటున్నట్లో చెప్పాలని ప్రశ్నించారు.
Samayam Telugu Revanth Reddy


ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారమిస్తే.. 9 నెలల ముందే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలన్నారు రేవంత్. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబును విమర్శిస్తూ.. ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో అమరావతికి పోయిన చంద్రబాబుతో ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అంతం కావాలనే చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారన్నారు.

ప్రజలు 60 రోజుల సమయం ఇస్తే.. ఆ తర్వాత 60 నెలల సమయం తెలంగాణ సమాజం కోసం పనిచేస్తామన్నారు రేవంత్‌. ఢిల్లీలో ఉండే ప్రధాని మోదీ జీతగాడు కేసీఆర్‌ సీఎంగా ఉండాలా.. రాహుల్ మనిషి పాలించాలో ప్రజలు తేల్చుకోవాలంటూ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్‌ సీఎం అయితే.. ఆయన కుటుంబం బాగుపడిందేకాని.. అమర వీరుల కుటుంబాలను పిలిచి బుక్కెడు అన్నం కూడా పెట్టలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు షాక్‌ తప్పదన్నారు రేవంత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.