యాప్నగరం

హైదరాబాద్: గుజరాత్, యూపీ బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం

​​సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న మహా యువభేరికి పలు రాష్ట్రాల బీజేపీ యువమోర్చా కార్యకర్తలు హాజరయ్యారు.

Samayam Telugu 28 Oct 2018, 3:38 pm
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ యువమోర్ఛా జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తోంది. 'విజయ్‌ లక్ష్య 2019' పేరుతో శుక్రవారం ప్రారంభమైన బీజేపీ మహాసభలు నేటి కార్యక్రమాలతో ముగియనున్నాయి. నేటి కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.
Samayam Telugu BJYM Meeting


సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న మహా యువభేరికి పలు రాష్ట్రాల బీజేపీ యువమోర్చా కార్యకర్తలు హాజరయ్యారు. యూపీకి చెందిన బీజేవైఎం కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరుతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుజరాత్ బీజేవైఎం కార్యకర్తలు యూపీ కార్యకర్తలను కాస్త తగ్గాలని సూచించారు. అయినా వారు తగ్గకపోవడం భేదాభిప్రాయాలు వచ్చి గొడవ జరిగింది. మరికాసేపట్లో అమిత్ షా వస్తారనగా సొంత పార్టీ విభాగాల మధ్య గొడవలు తగదని సూచించి వివాదాన్ని సమసిపోయేలా చేశారు.

గొడవ సద్దుమణగడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నేటి సాయంత్రం జరగే సభలో అమిత్ షా సహా 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నట్లు సమాచారం. ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.