అధికారం చేతిలో ఉంటే నేతలు, వారి బంధువులు దుర్వినియోగం చేస్తుంటారని తరచుగా ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అలాంటిది ఓ ఘటన జరిగింది. సనత్నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ మరో అభ్యర్థి కుమారుడి కారు డ్రైవర్పై దాడి చేయడం చర్చనీయాంశమైంది.
సనత్నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ కుమారుడు గౌరీశంకర్గౌడ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న నర్సింహయాదవ్తో పాటు అతని మిత్రులు కారులో జెక్కాలనీ ప్రాంతంలో వెళ్తుండగా కారును ఆపాలని తలసాని కుమారుడు సాయికిరణ్ డిమాండ్ చేశారు. అనంతరం కారును తనిఖీ చేయాలంటూ హల్చల్ చేశారు. తనిఖీ చేసేందుకు ఏ అధికారం ఉందని ప్రశ్నించడంతో కూన వెంకటేశ్ కుమారుడి కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడని కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
కాగా, సాయికిరణ్పై చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేతలు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడికి పాల్పడ్డ సాయికిరణ్ని అరెస్ట్ చేయాల్సిందేనంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు.
సనత్నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ కుమారుడు గౌరీశంకర్గౌడ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న నర్సింహయాదవ్తో పాటు అతని మిత్రులు కారులో జెక్కాలనీ ప్రాంతంలో వెళ్తుండగా కారును ఆపాలని తలసాని కుమారుడు సాయికిరణ్ డిమాండ్ చేశారు. అనంతరం కారును తనిఖీ చేయాలంటూ హల్చల్ చేశారు. తనిఖీ చేసేందుకు ఏ అధికారం ఉందని ప్రశ్నించడంతో కూన వెంకటేశ్ కుమారుడి కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడని కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
కాగా, సాయికిరణ్పై చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేతలు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడికి పాల్పడ్డ సాయికిరణ్ని అరెస్ట్ చేయాల్సిందేనంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు.