యాప్నగరం

2009 Lok Sabha Results: విభజనకు ముందు కాంగ్రెస్‌దే పైచేయి!

ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు తెలంగాణలో ఏ పార్టీది పైచేయిగా ఉండేది? 2009లో ఎవరెన్ని లోక్‌సభ స్థానాలు సాధించారు?

Samayam Telugu 2 Nov 2018, 4:58 pm
2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. టీడీపీ 2, టీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం 1 చొప్పున ఎంపీ స్థానాలు గెలుపొందాయి. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో తెలంగాణ నియోజకవర్గాల వివరాలను ఇక్కడ ఇస్తున్నాం.
Samayam Telugu Untitled1122


2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ డిమాండుకు టీడీపీ మద్దతు తెలపడంతో టీఆర్‌ఎస్ పార్టీ టీడీపీతో పొత్తుపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో రెండు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలనే దక్కించుకోగలిగింది. 2009, సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. 2009-2014 మధ్య ఏపీలో ఎన్నో నాటకీయ పరిణమాలు చోటుచేసుకున్నాయి. 2014లో ఏపీ పునర్విభజన చట్టం అమలుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2009లో తెలంగాణలో ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుపొందారో ఈ కింది జాబితాలో చూడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.