యాప్నగరం

Telangana Polling: భారీ మెజార్టీతో నెగ్గుతాం: కేసీఆర్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Samayam Telugu 7 Dec 2018, 3:33 pm
తెలంగాణలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, అధికారం నిలబెట్టుకుంటామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీమాగా ఉన్నారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధమని చెప్పారు.
Samayam Telugu KCR


‘రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. దీంతో భారీ మెజార్టీతో మేం గెలవబోతున్నాం. సాయంత్రం ఎగ్జిట్ పోల్ చూస్తే మీకే తెలుస్తుంది. హైదరాబాద్‌లోనూ భారీగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఏదైనా పార్టీకి పవనాలు రోజు ఓ తీరుగా వీచే అవకాశం ఉండదు. వృద్ధులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని’ కేసీఆర్ వివరించారు.

అందరూ ఓటు వేయాలి: కేటీఆర్
బంజారాహిల్స్‌లోని సెయింట్ నిజామిస్ స్కూల్‌లో కేటీఆర్ తన ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో కొద్దిసేపు వేచి ఉన్నారు. ఓటు వేసిన వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.