యాప్నగరం

Telangana Congress: ‘చేయి’ దాటలేదు.. పొన్నాలకు అధిష్టానం గుడ్‌న్యూస్?

కాంగ్రెస్ మొదటి జాబితాలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు మిస్సైంది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.

Samayam Telugu 13 Nov 2018, 1:52 pm
కాంగ్రెస్ పార్టీ సోమవారం అర్థరాత్రి విడుదల చేసిన జాబితాలో సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనగామ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు మహాకూటమి పొత్తుల్లో్ భాగంగా ఆయన స్థానం తెలంగాణ జనసమితి (టీజేఎస్) కోదండరాంకు ఇస్తారని ప్రచారం జరిగింది.
Samayam Telugu Untitled11


65 మంది అభ్యర్థుల వివరాలతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలిజాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. దీనిపై పొన్నాలతో పాటు ఆయన అనుచరులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలను కలిశారు. దీంతో, జనగామ సీటు ఆయనకే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో విడుదల చేసే రెండో జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశాలున్నాయని సమాచారం.

1985లో రాజకీయాల్లో అడుగుపెట్టిన పొన్నాల.. జనగామ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నాల కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి మండలిలో స్థానం దక్కించుకున్నారు. 2004, 2009లో భారీ నీటిపారుదల, ఐటీ శాఖల మంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి అభ్యర్థులకు స్వయంగా బి-ఫారాలు అందించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు టికెట్ కోసం అధిష్టానం చుట్టూ తిరగాల్సి రావడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆయన బీసీలకు ప్రతినిధి కావడంతో కాంగ్రెస్ బీసీలను పక్కన పెడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అధిష్టానం పొన్నాలకే ఆ సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, పొన్నాల కొన్నేళ్లుగా నియోకవర్గానికి దూరంగా ఉండటం వల్ల గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని, కోదండరాంకు ఆ టికెట్ ఇవ్వడం వల్ల మహాకూటమికి ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచనతోనే అధిష్టానం పొన్నాల సీటుపై నిర్ణయాన్ని పెండింగులో పెట్టిందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.