ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై, మరికొందరు రెబల్స్గా నామినేషన్ దాఖలు చేసిన వారిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొరడా ఝుళిపించింది. శనివారం (నవంబరు 24) గాంధీ సమావేశమైన టి.పీసీసీ క్రమశిక్షణా కమిటీ... 24 మంది నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఇక నారాయణపేటలో శివ కుమార్ తో పాటు మరో ఐదుగురిపై వేటు వేసింది.
బహిష్కరణకు గురైన నేతలు వీరే..
బహిష్కరణకు గురైన నేతలు వీరే..
- రవి శ్రీనివాస్ (సిర్పూర్)
- బోడ జనార్ధన్ (చెన్నూర్)
- హరి నాయక్ (ఖానాపూర్)
- అనిల్ జాదవ్ (బోత్)
- నారాయణ్రావు పాటిల్ (ముధోల్)
- అరుణ తార (జుక్కల్)
- ఎన్. రత్నాకర్ (నిజామాబాద్ అర్బన్)
- శ్రీ గణేష్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్)
- కె. శివకుమార్ రెడ్డి (నారాయణపేట్)
- ఇబ్రహీం (మహబూబ్నగర్)
- సురేందర్ రెడ్డి (మహబూబ్నగర్)
- బెల్లయ్య నాయక్ (దేవరకొండ)
- పాల్వాయి శ్రవణ్కుమార్ రెడ్డి (మునుగోడు)
- డాక్టర్ రవి కుమార్ (తుంగతుర్తి)
- మాలావత్ నెహ్రూ నాయక్ (డోర్నకల్)
- అబ్బయ్య (ఇల్లందు)
- బానోతు బాలాజీ నాయక్ (ఇల్లందు)
- యడవల్లి కృష్ణ (కొత్తగూడెం)
- రాములు నాయక్ (వైరా)
- చిట్టెం అభిజయ్ రెడ్డి (నారాయణపేట)
- కావలి నరహరి (ధన్వాడ మండల అధ్యక్షుడు)
- సాయి రెడ్డి (నారాయణపేట)
- నిరంజన్ రెడ్డి (నారాయణపేట)
- సౌభాగ్య లక్ష్మీ (నారాయణపేట)