యాప్నగరం

డిక్కీలో జాగా లేదు.. ఖుష్బు ఘాటు వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ‘కారు’ గుర్తుపై సెటైర్లు వేసిన కాంగ్రెస్ నేత, నటి ఖుష్బు సుందర్.

Samayam Telugu 4 Dec 2018, 8:02 pm
బుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్.. ఆయన కోసం మాత్రం బుల్లెట్ ప్రూఫ్‌ ఇళ్లు కట్టుకున్నారని కాంగ్రెస్‌ నేత, ప్రముఖ నటి ఖుష్బు ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్న ఖుష్బు కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
Samayam Telugu BCB6FE96-1E96-4E19-8CC9-60F6DBA86665


బతుకమ్మ చీరల పేరిట రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రజలకు నాసిరకం బతుకమ్మ చీరలు పంచారన్నారు. పేదలకు పంచిన బతుకమ్మ చీరలను కేసీఆర్‌ కూతురు కవిత కట్టుకుంటుందా? అని ప్రశ్నించారు. ప్రజలు తనను ప్రశ్నించి, దాడి చేస్తారనే కారణంతోనే కేసీఆర్ రూ.300 కోట్ల ఖర్చుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంటిని నిర్మించుకున్నారని తెలిపారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు.

ఆ ‘కారు’ పాత మోడల్: ‘‘టీఆర్ఎస్ పార్టీ ‘కారు’ గుర్తును చూశారా? అది అంబాసిడర్ కారు. ఇప్పుడది మార్కెట్లో లేదు. కంపెనీ బంద్ చేశారు. ఆ బండిలో ఐదుగురికి మాత్రమే జాగా ఉంది. మిగతావారికి స్థానం లేదు. కారులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ కూర్చుంటారు. డిక్కీలో ఎక్కాలన్నా.. జాగా ఉండదు. ఎందుకంటే అందులో డబ్బు ఉంటుంది’’ అని ఖుష్బు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.