యాప్నగరం

Telangana Bjp: టీఆర్ఎస్, కూటమి.. ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు: గడ్కరీ

కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత మాదే.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం - నితిన్ గడ్కరీ

Samayam Telugu 2 Dec 2018, 4:20 pm
తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం బాధ్యత మరవలేనిదని, ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.50 వేల కోట్ల నిధులను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉప్పల్ రింగ్‌రోడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ పాల్గొన్నారు.
Samayam Telugu 18D26B2E-AD26-4328-BDAC-E9939FB84AA1


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్దికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన బీజేపీకి ఓటేసి గెలింపించాలని కోరారు. స్వార్థ రాజకీయాల కోసమే కూటమి ఏర్పాటైందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలని, బీజేపీ ఒక్కటే ప్రజల పార్టీ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.