యాప్నగరం

మ్యానిఫేస్టోలో వరాలు.. కేసీఆర్‌కు పాలాభిషేకం!

ఎన్నికల్లో మరోసారి తమ అధికారం అప్పగిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాక్షికంగా మ్యానిఫేస్టో ప్రకటించారు.

Samayam Telugu 22 Oct 2018, 2:00 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగరా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోడానికి వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. నాలుగు రోజుల కిందట టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫేస్టోలో వరాలు జల్లు కురిపించారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగ యువతకు భృతి లాంటి హామీలు గుప్పించారు. వీటిపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి ఆయన మద్దతుదారులు పాలాభిషేకాలు చేస్తున్నారు. బోరబండ సాయిబాబానగర్ బస్తీ అధ్యక్షుడు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పాలభిషేకం చేశారు.
Samayam Telugu kcr


అటు వరంగల్‌లోనూ రెండు రోజుల కిందట కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం జరిగింది. మ్యానిఫేస్టోలో కేసీఆర్ ప్రకటించిన పెన్షన్ల పెంపు, రైతులకు అండగా తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నాయకులు కాజీపేట చౌరస్తాలో కేసీఆర్ చిత్ర పటానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. రైతు రాజ్య స్థాపన, రైతును రాజును చేయాలనే గొప్ప సంకల్పంతో మ్యానిఫేస్టోలో మంచి కార్యక్రమాలను ప్రకటించారని, పెన్షన్లు పెంపు నిర్ణయం వల్ల పేదలకు, వికలాంగులకు ఒక భరోసా లభించిందని ప్రశంసించారు. రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని, ఎన్ని కూటములు వచ్చినా ఆయన నాయకత్వం ముందు నిలవలేవరని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.