యాప్నగరం

వాజ్‌పేయ్ మరణాన్నీ వాడేస్తున్నారా?

మహా నేతలపై గౌరవం ఉండొచ్చు. వారి మరణం పార్టీకి తీరని లోటే. కానీ, ఎన్నికల మజిలీ కోసం వారి మరణాన్ని సైతం ప్రచారాల్లో వాడుకోవడం తప్పుకాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Samayam Telugu 10 Oct 2018, 9:13 pm
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అస్త్రలు సిద్ధం చేస్తున్నాయి. ఏ ఏడాది ఎన్నికలు జరపుకోనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ముఖ్య నేతలు ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, మహానుభావుల మరణాలను సైతం ఎన్నికల ప్రచారంలో వాడేసుకోవడమే విమర్శలకు దారితీస్తోంది.
Samayam Telugu Untitled1911


ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం తెలంగాణ వచ్చారు. కరీంనగర్‌లోని అంబేద్కర్‌ మైదానంలో జరిగిన సమరభేరిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని, దివంగత మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ అంతిమయాత్రలో ప్రధాని కాలినడక పాల్గొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

‘‘వాజ్‌పేయీ అంతిమ యాత్రలో ప్రధాని మోదీ ఐదు కిలోమీటర్లు నడిచారు. అదీ మా పార్టీ వాజ్‌పేయీకి ఇచ్చిన గౌరవం. కానీ తెలంగాణ పుత్రుడు, భూమి పుత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణిస్తే ఆయన అంత్యక్రియలను కూడా ఢిల్లీలో జరపలేదు. ఇందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం. కాంగ్రెస్‌ దుశ్చర్యల అర్థం చేసుకున్న ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు’’ అని వెల్లడించారు.

అయితే, అమిత్ షా వాజ్‌పేయీ అంత్యక్రియల విషయాన్ని ప్రస్తావించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ అలా చేశారా? అనే అనుమానాలు కలిగేలా అమిత్ షా మాట్లాడుతున్నారని తెలుపుతున్నారు. వాజ్‌పేయీ మరణం తర్వాత ఆయన చితాభస్మాన్ని పలు రాష్ట్రాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి నదుల్లో కలిపిన సంగతి తెలిసిందే. ఈ చర్యలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.