యాప్నగరం

నవంబర్‌ 24న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మర్రి

నవంబర్ 24న తెలంగాణ ఎన్నికల జరగబోతున్నాయా.. మర్రి శశిధర్ చెబుతున్నది నిజమేనా..

Samayam Telugu 24 Sep 2018, 6:16 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా.. నవంబర్ 24న జరగబోతున్నాయా.. అవునంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మాట్లాడిన మర్రి.. ఓ పత్రిలో నవంబర్ 24న ఎన్నికలు జరుగుతాయంటూ కథనం వచ్చిందని.. టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇదే చెబుతున్నారని.. ఈ సమాచారం అపద్ధర్మ సీఎం కేసీఆర్ చేసిన లీక్ అంటున్నారు మర్రి. ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారం కేసీఆర్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
Samayam Telugu Marri


తెలంగాణ ఓటర్ల జాబితాను కూడా కేసీఆర్ చెప్పినట్లే తయారు చేస్తున్నారంటున్నారు మర్రి. ఇప్పటికే తొలగించిన ఓట్లు.. కొత్తగా నమోదు చేసుకున్న ఓట్లకు సంబంధించిన డ్రాఫ్ట్ ఇవ్వడం లేదన్నారు. నవీన్ మిట్టల్ అనే అధికారిని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో ఎలక్ట్రోలర్ అబ్జర్వర్‌గా నియమించి.. ఓటర్ల లిస్ట్‌ పనులు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. మిట్టల్‌పై ఆరోపణలు ఉన్నాయని.. ఆయన్ను అబ్జర్వర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మార్చి, ఏప్రిల్‌లోనే బోగస్ ఓట్ల తొలగిస్తే.. మళ్లీ బోగస్ ఓట్లెలా వచ్చాయని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.