యాప్నగరం

వాళ్ల మెప్పు కోసమే కొండా విమర్శలు.. ముష్టి 3 సీట్ల కోసం కోదండరాం పొర్లు దండాలు: కేటీఆర్

ఢిల్లీ బాసులకు.. అమరావతి నేతలకు గులాంలు అవుతామా.. తెలంగాణ స్వాభిమానాన్ని వాళ్ల కాళ్ల దగ్గర పెడదామా..

Samayam Telugu 25 Sep 2018, 10:15 pm
పార్టీ నుంచి బయటికెళ్లేవారు.. పోతూ పోతూ రాళ్లు వేయడం మామూలేనంటున్నారు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన మంత్రి.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొండా దంపతులు టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి.. పక్క పార్టీ మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు కేటీఆర్. ఇలాంటి విమర్శలు సహజమని.. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. ఎవరి బలం ఏంటో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu KTR


కాంగ్రెస్, తెలంగాణ జనసమితిపైనా విరుచుకుపడ్డారు కేటీఆర్. రాజకీయాల్లో విలువలు లేకుండా అధికారం కోసం కూటమి కడుతున్నారని విమర్శించారు మంత్రి. ఢిల్లీ బాసులకు.. అమరావతి నేతలకు గులాంలు అవుతామా.. తెలంగాణ స్వాభిమానాన్ని వాళ్ల కాళ్ల దగ్గర పెడదామా అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాధికారం మన చేతుల్లో ఉంచుకొని.. ఆత్మగౌరవంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. ప్రజలు రాళ్లతో కొడతారని ఏపీ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ గుర్తు చేశారు.

కోదండరాం ఇకనైనా ఆత్మవంచన చేసుకోవడం మానేయాలన్నారు మంత్రి. తనకు ప్రజాభిమానం ఉందంటూ.. 119 స్థానాల్లో పోటీ చేస్తానన్న ఆయన.. ఇప్పుడు ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారన్నారు. తెలంగాణ కోసం యువత అమరులు కావడానికి కారణమైన పార్టీలతో కోదండరాం పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు కేటీఆర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.